Current Date: 05 Oct, 2024

ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను... రేణు దేశాయ్...

ఆంధ్రప్రదేశలో అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌ అఖండ విజయం సాధించినప్పటి నుంచి అకీరా తన తండ్రి పవన్  కల్యాణ్‌తోనే ఉంటున్నారు. అతడిని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఎన్డీయే సమావేశానికి హాజరైన పవన్ తన కుమారుడిని కూడా ఢిల్లీ తీసుకెళ్లారు. మోదీకి అకీరాను పరిచయం చేశారు. దీనిపై రేణు దేశాయ్‌ భావోద్వేగంగా ఓ పోస్ట్‌ చేశారు. నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానమనీ.. మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, భావోద్వేగంగా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేనని అన్నారు. మోదీ గారిని కలిశాక అకీరా నాకు ఫోన్‌ చేసి తన అనుభూతి పంచుకున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. తన చుట్టూ ఓ పాజిటివ్‌ వైబ్‌ ఉందని చెప్పాడని రేణుదేశాయి చెప్పారు.