Current Date: 02 Jul, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ‘పల్లా’ బాధ్యతలు

గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు మెజారిటీతో ఎన్నికైన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమితుడు అవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను తనకు అప్పగించిన చంద్రబాబు, నారా లోకేశ్‌లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడిరచారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పై 95,235 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. గతంలో ఆయన విశాఖ పార్లమెంటరీ స్థానం టీడీపీ ఇన్చార్జిగా సమర్థవంతంగా వ్యవహరించడం టీడీపీ అధినాయకత్వాన్ని ఆకట్టుకుంది.

Share