Current Date: 21 Sep, 2024

విజయసాయిరెడ్డి కూతురు స్థలంలో మరోసారి నిర్మాణాల కూల్చివేత

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డికి హైకోర్టులో మరో షాకిచ్చింది. వైసీపీ అధికారంలో వున్న సమయంలో నేహా రెడ్డి విశాఖలో నిర్మించుకున్న ఓ కటడం అక్రమమని తేల్చిన హైకోర్టు దాన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు మరో షాకిస్తూ తాజాగా జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేహా రెడ్డికి చెందిన స్థలంలోని కాంక్రీట్‌ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో సర్వే నెంబర్‌ 1516, 1517, 1519, 1523లో ఉన్న స్థలంలో ఈ కట్టడాలు ఉన్నాయి. సుమారు 4 ఎకరాలు ఉన్న ఈ ఆక్రమిత స్థలంలో అక్రమ కట్టడాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

Share