Current Date: 07 Oct, 2024

సాంగ్‌లో కేసీఆర్ డైలాగ్ వాడేసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్

యంగ్ హీరో రామ్ నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ‘మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంత చోడ్ చింత’ సాంగ్ బయటికి వచ్చింది. ఈ పాట వచ్చీ రావడమే సోషల్ మీడియా‌లో వైరల్‌గా మారిపోయింది. దానికి కారణం సాంగ్‌లో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫేమస్ డైలాగ్ ‘ఏం చేద్దాం అంటవ్ మరి’ ఉండడమే.రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కలయికలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది.రామ్ సరసన కావ్య థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ విల‌న్ గా న‌టిస్తున్నాడు. పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై ఛార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాధ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Share