Current Date: 06 Jul, 2024

వాయుగుండంగా బలపడ్డ అల్పపీడనం... తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం...

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. ఆంధ్ర ప్రదేశ్‌పై తుఫాన్‌ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది. నేటికి వాయుగుండం తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్‌కి రెమాల్‌‌గా నామకరణం చేశారు. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మే 26వ తేదీన అర్థరాత్రి బెంగాల్, బంగ్లాదేశ్‌ మధ్య తీవ్ర తుపాన్‌గా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరందాటే సమయంలో గంటకు 90నుంచి 110కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అయితే ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. ఉత్తర ఒడిశా, బెంగాల్, మిజోరాంత్రిపుర, మణిపూర్‌పై తుఫాన్‌ ఎఫెక్ట్‌ బాగా ఉంటుందని తెలిపింది ఐఎండీ. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.