Current Date: 06 Jul, 2024

తగ్గిన వాణిజ్య సిలిండర్‌పై రూ.70 తగ్గింపు

లోక్‌సభ ఎన్నికల చివరి దశకు ముందు ఎల్పీజీ వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. ఎల్పీజీ సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు, గ్యాస్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వరుసగా మూడోసారి తగ్గించాయి. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎల్పీజీ సిలిండర్ల ధర మూడు రెట్లు తగ్గింది. ప్రభుత్వ చమురు కంపెనీలు జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం, నేటి నుంచి దేశంలోని వివిధ నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ల ధర సుమారు రూ.70 తగ్గింది. అయితే ఈ తగ్గింపు ప్రయోజనం 19 కిలోల వాణిజ్య సిలిండర్లకు మాత్రమే. గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఈసారి కూడా ఎలాంటి మార్పు లేదు. 
కాగా, ఢల్లీిలో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.69.50 తగ్గి రూ.1676కి చేరుకుంది. అంతకుముందు ఏప్రిల్‌ నెలలో ధర రూ.19 తగ్గి రూ.1,745.50కి వచ్చింది. కోల్‌కతాలో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్లు రూ.1,787గా ఉంది. ముంబై ప్రజలు ఇప్పుడు ఈ పెద్ద సిలిండర్‌ కోసం రూ. 1,629 చెల్లించాల్సి ఉంటుంది.