Current Date: 05 Oct, 2024

సీబీఐ కేసులోనూ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ జూన్‌ 7 వరకు పొడిగింపు


 ఢల్లీి మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 7వ తేదీ వరకు పొడిగించింది. అంతకుముందు ఈడీ కేసులో కవిత కస్టడీని వచ్చే నెల 3 వరకు పొడిగించిన న్యాయస్థానం... ఆ తర్వాత సీబీఐ కేసులోనూ ఈ శుక్రవారం వరకు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ జూన్‌ 7న కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేయనుంది. మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకున్నది.