Current Date: 06 Jul, 2024

వేణు స్వామిని టార్గెట్ చేసిన టీడీపీ.. కానీ సీన్ రివర్స్!

ఐపీఎల్ 2024 ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో, జ్యోతిష్కుడు వేణుస్వామిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. తన పాపులారిటీ కోసం, యూట్యూబ్ , సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకునే వేణు స్వామి.. సినీ ప్రముఖులు, క్రీడాకారులు , రాజకీయ నాయకుల గురించి జోస్యాలు చెప్తుంటారు.అదృష్టవశాత్తూ, అతను కొన్ని అంచనాలు నిజం కావడంతో.. అతని మాటపై అందరికీ గురి కుదిరింది. ఐపీఎల్ 2024 విజేతగా హైదరాబాద్ నిలిచే అవకాశం ఉందని వేణు స్వామి చెప్పలేదు.. కానీ కావ్య మారన్ జాతకం ప్రకారం ఆ టీమ్ బాగా ఆడుతుందని మాత్రమే చెప్పాడు. ఆయన చెప్పినట్లే హైదరాబాద్ ఎవరి అంచనాలకి అందని విధంగా ఫైనల్ వరకూ వెళ్లింది. కానీ.. హైదరాబాద్ టీమ్ గెలుస్తుందని వేణు స్వామి చెప్పినట్లు యూట్యూబర్లు థంబ్ నైల్స్ పెట్టి వైరల్ చేస్తున్నారు.ఏపీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలవడం గురించి కూడా వేణు స్వామి చెప్పాడు. దాంతో టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వేణు స్వామిపై సెటైర్ పేల్చింది. నిజానికి టీడీపీ అధికారిక ఖాతా నుంచి రెస్పాండ్ అయ్యి ఉండకూడదు. కానీ.. ట్వీట్‌తో వేణు స్వామి మాటలకి మరింత ఇంపార్టెన్సీని పెంచి.. తప్పుడు థంబ్ నైల్‌ని పోస్ట్ చేసినందుకు నవ్వులపాలైంది.