Current Date: 02 Jul, 2024

రాష్ట్ర గవర్నర్ కు వైసిపి నేతల ఫిర్యాదు


తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 26 జిల్లాలో గత 26 రోజులుగా  వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తల పై జరుగుతున్న దాడులను, వై యస్ రాజశేఖర్ రెడ్డి  విగ్రహాల ధ్వంసం పై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా నడుచుకొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలి పై, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదని,  తదితర అంశాల పై శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి వైసిపి నాయకులు ఫిర్యాదు చేశారు.
పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రమి రెడ్డి, శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, మాజి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసన సభ్యులు మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు

Share