Current Date: 06 Oct, 2024

చంద్రబాబుతో మాజీ సీఎం భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ లో  చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించినట్టు సమాచారం. సోమవారం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కిరణ్ కలిశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.రాజంపేట లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీచేసి ఓడిపోయారు.

Share