Current Date: 07 Oct, 2024

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం  ఢిల్లీకి బయలుదేరివెళ్లారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.   ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తదితరులను కలిసే అవకాశమున్నట్లు అధికారవర్గాల సమాచారం.   అపాయింట్‌మెంట్‌ దొరికితే ప్రధాని మోడీని కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఈ నెల 3న  ఢిల్లీవెళ్లి ప్రధానితో పాటు, పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయిన విషయం తెలిసిందే. రెండు వారాల వ్యవధిలోనే ఆయన మరోసారి  ఢిల్లీవెళ్లారు.

Share