Current Date: 06 Oct, 2024

వైసీపీ నుంచి మొదలైన వలసల ప్రవాహం రేసులో మరో ముగ్గురు

ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి ఇంకా కోలుకోని వైసీపీకి వ‌రుస షాక్‌లు త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ గుడ్ బై చెప్పేయగా  మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరే కాదు.. రాబోవు రెండు మూడు వారాల్లో మరి కొంద‌రు ప్ర‌ముఖులు కూడా పార్టీని వీడ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.రాజ్య‌స‌భ స‌భ్యుడు బీద మ‌స్తాన్‌రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇటీవల టీడీపీ టచ్‌లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవ‌డంతో ఆగమేఘాల మీద వైసీపీలో చేరారు. ఇద్దరికీ వైయస్ జగన్ ప్రాధాన్యత ఇస్తూ మంచి  స్థానాలు ఇచ్చారు.బీద మ‌స్తాన్‌రావును వైసీపీలో రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కూడా ద‌క్కింది. కానీ బిజినెస్‌మాన్ అయిన బీద మ‌స్తాన్‌రావు ఇప్పుడు వైసీసీకి అధికారం చేజారడంతో తన సొంత వ్యాపారాలు కాపాడుకోవడానికి టీడీపీలోకి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఇక ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన సునీత వైసీపీలో చాలా యాక్టీవ్‌గా కనిపించారు. కానీ.. ఆమె వీడే ఆలోచనలో ఉండటంతో ఇక కొత్త చిక్కులు ఎదురుకానున్నాయి.

Share