Current Date: 09 Oct, 2024

కుమార్తెతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు. కుమార్తె ఆద్యతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తొలుత ఆలయం వద్ద అధికారులు పవన్ కు   స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. నేడు మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది.

Share