Current Date: 09 Oct, 2024

2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం!

పేదలకు ఉచితంగా బియ్యం అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్రం పొడిగించింది. 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 17,082 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. రాబోయే పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 

Share