Current Date: 02 Jul, 2024

ఢిల్లీ విమానాశ్రయంలో కూలిన టెర్మినల్‌ పైకప్పు నలుగురికి గాయాలు కార్లు ధ్వంసం

దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్‌-1 పైకప్పులో కొంత భాగం శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ట్యాక్సీలు సహా పలు కార్లపై పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని రెప్క్యూ సిబ్బంది రక్షించారు. మరొకర్ని కాపాడేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.ఢిల్లీ ని చాలా ప్రాంతాల్లో వరుసగా రెండోరోజూ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు భీకర ఎండలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. కానీ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. మరోవైపు టెర్మినల్‌-1 నుంచి బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. 

Share