Current Date: 04 Jul, 2024

ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజ్ రూ. 50లక్షలు . తెలుగు నటి హేమ ఉంది.

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాకు తెలియజేశారు.
ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అని వెల్లడించారు.

ఈ రేవ్ పార్టీకి 'సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ' అని పేరుపెట్టారని తెలిపారు. ఈ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, తాను ఈ పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫాంహౌస్ లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్ చేశారన్నదానిపై విచారణ జరుపుతున్నామని సీపీ వివరించారు.

ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్ చేశామని, ఇందులో ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని వెల్లడించారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలోని ఓ ఫాంహౌస్ లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో అత్యధికంగా తెలుగు బుల్లితెర నటులు, మోడళ్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఈ రేవ్ పార్టీని ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేశారు.