Current Date: 05 Oct, 2024

జన సైనికురాలి కుటుంబానికి 5 లక్షల చెక్ అందించిన నాగబాబు

మన్యం జిల్లాలోని పాలకొండ నియోజక వర్గంకు చెందిన దుప్పాడ కుమారి కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన జనసేన PAC చైర్మన్ కొణిదల నాగబాబు. పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ మునిసిపాలిటీలో పెద్దకాపు వీధికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు దుప్పాడ కుమారి  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో  పంపిణి చేసిన జనసేన పార్టీ రాష్ట్ర PAC చైర్మన్ కొణిదెల నాగబాబు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, జనసేన స్థానిక నాయకులు గులివెందుల లక్ష్మణ్,జనసేన శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మరియు మాదాసి సంతోష్ పాల్గొన్నారు .

Share