Current Date: 04 Oct, 2024

కోనసీమలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఫలించిన 5 ఏళ్ల నిరీక్షణ

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లారామచంద్రపురంలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. అది కూడా పెళ్లయిన ఐదేళ్ల తర్వాత గర్భందాల్చి.. ఇలా ప్రసవించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ తల్లికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ముగ్గురు పిల్లలకు పురుడు పోశారు. రాజనగరం మండలం పాత తుంగపాడు గ్రామానికి చెందిన ఆలపాటి సంధ్యా కుమారి, వీరబాబు దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా.. సంతానం కలగలేదు. ఈ ఐదేళ్లలో కనిపించిన దేవుళ్లందరికి మొక్కుతూ, తమకు తెలిసినా, బంధువులు చెప్పిన ఆస్పత్రులన్నింటికీ తిరిగి చికిత్స తీసుకున్నారు. కానీ సంధ్యా కుమారి కడుపు మాత్రం పండలేదు. ఎట్టకేలకు గర్భవతి అయిన సంధ్య ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి పిల్లలు క్షేమంగానే ఉన్నారని డాక్టర్ తెలిపారు. ఉండవల్సిన బరువుతోనే శిశువు పుట్టారని వైద్యులు తెలిపారు.

Share