Current Date: 06 Oct, 2024

అప్పన్న స్వామి సేవలో హోమ్ మంత్రి అనిత

రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు, అర్చక పరివారంతో కలిసి ఈఓ శ్రీనివాసమూర్తి సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.కప్పస్తంభం ఆలింగనం చేసుకుని మనసులోని కోరికలను స్వామివారికి నివేధించుకున్నారు. అంతరాలయంలో అర్చకులు హోమ్ మంత్రి పేరున అష్టోత్తర నామార్చన చేశారు.గోదాదేవి సన్నిధిలో మంగళహారతులిచ్చారు. కళ్యాణ మండపంలో మంత్రిని ఆశీనులను చేసి నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రొచ్చారణల నడుమ అర్చకులు ఆశీర్వాదం చేశారు. స్వామివారి శేష వస్త్రాలు,ప్రసాదాలను ఈఓ మంత్రికి అందజేసారు.  

Share