Current Date: 31 Mar, 2025

ఏపీలో 47 మార్కెట్ క‌మిటీల‌కు ఛైర్మ‌న్ల నియామ‌కం

ఏపీలో 47 మార్కెట్ క‌మిటీల‌కు ఛైర్మ‌న్ల‌ను కూటమి ప్ర‌భుత్వం నియ‌మించింది. మొత్తం స‌భ్యుల‌తో క‌లిసి 705 నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. తాజాగా ప్ర‌క‌టించిన 47 ఏఎంసీ ఛైర్మ‌న్ ప‌ద‌వుల్లో 37 టీడీపీ, 8 జ‌న‌సేన‌, 2 బీజేపీ నేత‌ల‌కు ద‌క్కాయి. త్వ‌ర‌లోనే మిగతా మార్కెట్ క‌మిటీల ఛైర్మ‌న్ల‌ను ప్ర‌క‌టించనున్నారు. కాగా, అభ్య‌ర్థుల ఎంపిక కోసం ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

Share