Current Date: 07 Oct, 2024

టాలీవుడ్‌లో జాన్వీ క్రేజ్ శ్రీదేవి కూతురా మజాకా!

టాలీవుడ్‌ని ఒకప్పుడు దశాబ్దకాలం అతిలోక సుందరి శ్రీదేవి షేక్ చేసింది. అప్పట్లో ఆమెతో ఏ హీరోయిన్ కూడా పోటీపడలేకపోయారు. అందం, అభినయం మాత్రమే కాదు రెమ్యూనరేషన్‌లోనూ శ్రీదేవి దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లలేకపోయారు. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ మొదలైంది.తెలుగులో సీనియర్ హీరోయిన్లు నయనతార, త్రిష లాంటి వాళ్లు అయిదు నుంచి పది కోట్లు ఇన్నాళ్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చారు. కానీ  తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయని జాన్వీ  ఏకంగా రూ.8 కోట్లు తీసుకుంటోందని టాక్ వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో దేవర సినిమాలో జాన్వీ నటిస్తుండగా.. ఆ మూవీ రషెష్ చూసిన ప్రొడ్యూసర్లు జాన్వీ కోసం క్యూ కడుతున్నారు. నాచురల్ స్టార్ నానితో ఒక సినిమా కోసం జాన్వీని సంప్రదించగా రూ.10 కోట్ల పైనే డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమాకు ఇప్పటికే ఓకే చెప్పిన జాన్వీ  పాన్ ఇండియా మూవీలకి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గత ఆరేళ్లుగా బాలీవుడ్‌లో సినిమాలు చేసినా జాన్వీకి చెప్పుకోదగ్గ హిట్ లేదు. అయినప్పటికీ కుర్రకారులో ఆమెకి క్రేజ్ తగ్గకపోవడంతో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

Share