Current Date: 04 Jul, 2024

ఎగ్జిట్ రేపు..ఎగ్జాట్ 4న....

 రేపు విడుదలయ్యే ఎగ్జిట్ సర్వేలు ఏమి చెప్పబోతున్నాయి ?   ప్రీ పోల్ సర్వేలు ఒక ఎత్తు అయితే పోస్ట్ పోల్ సర్వేలు మరో ఎత్తు. సోషల్ మీడియా అంతా ఈ తరహా సర్వేలతో నింపేశారు.  ఇపుడు అసలైన ఘట్టం ఆరంభం అయింది. అందరూ ఆతృతగా ఎదురు చూసే కీలక సమయం దగ్గరకు వచ్చింది. అదే ఎగ్జిట్ పోల్ సర్వేల రిలీజ్. జూన్ 1న ఆఖరి విడత లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలతో పూర్తి అవుతాయి. ఆ మరుక్షణం ప్రముఖ మీడియా చానళ్ళలో వరసబెట్టి ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చేస్తాయి.  దేశంలో ఎవరు గెలుస్తారు అన్నది ఒక ఆసక్తి అయితే ఏపీలో ఎవరిది అధికారం అన్నది ఆసక్తికర అంశం  అయితే చాలా ఎక్కువ మందికి ఏపీ మీదనే దృష్టి ఉంది. జగనా చంద్రబాబా ఎవరిది విజయం జనాల మూడ్ ఏ వైపు ఉంది అన్నది ఎగ్జిట్ పోల్స్ కొంతలో కొంత అయినా విషయం చెబుతాయని అంతా ఎదురుచూస్తున్నారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకూ ప్రముఖ సర్వే సంస్థలు అన్నీ ఎగ్జిట్ పోల్స్ ని చేసి రిపోర్టులను చాలా రోజులుగా దగ్గర ఉంచుకున్నాయి. ఇందులో నుంచి కీలక సమాచారాన్ని వైసీపీ టీడీపీ అధినేతలకు కూడా పంపించారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఆ విధంగా కీలక పార్టీలకు ఎగ్జిట్ పోల్స్ లో ఏమి చెబుతారు సర్వేలు ఏ విధంగా వస్తాయన్నది ఈపాటికే తెలిసిపోయిన విషయం అని అంటున్నారు. అంటే జగన్ కి చంద్రబాబుకు జూన్ 1న వచ్చే ఎగ్జిట్ పోల్ సర్వేలలో మ్యాటర్ ఏమిటి అన్నది ఇదమిద్దంగా తెలుసు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ ని చూసి టెన్షన్ పడవద్దని ఒక పార్టీ తన పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేసినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఆ పార్టీ నేతలు డీలా పడకుండా అతి ముఖ్య సందేశం ఈ విధంగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది