Current Date: 05 Oct, 2024

మోదీ కష్టపడ్డారు: చంద్రబాబు

ఎన్డీయేను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దిల్లీలో ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్నికల ప్రచారం నుంచి చివరి వరకు మోదీ కష్టపడ్డారు. ఏపీలోనూ 3 బహిరంగసభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. విజనరీ నాయకుడి నేతృత్వంలో భారత్‌ అభివృద్ధిలో ముందుంది. దూరదృష్టి కలిగిన ఆయన.. ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుంది’’అని చంద్రబాబు అన్నారు.