Current Date: 24 Sep, 2024

దుర్గగుడి ఆలయ మెట్లు శుభ్రంచేసిన పవన్‌

తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను మంగళవాసం  శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.   సనాతన ధర్మం జోలికి రావొద్దు. తప్పు జరిగితే ఒప్పుకోండి.. లేకపోతే సంబంధం లేదని చెప్పండి అని సూచించారు. ‘సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ విషయం తెలుసుకుని మాట్లాడాలన్నారు.  
కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు.  వచ్చేనెల 2న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించనున్నారు.

Share