Current Date: 24 Sep, 2024

కంచరపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు

 కంచరపాలెం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం సుమారు 6 గంటల సమయములో  ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఊర్వశి జంక్షన్ నుండి తాటిచెట్లపాలెం వైపుగా ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో సంజయ్ నగర్, జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తున్న సీతమ్మ పేట ప్రాంతానికి చెందిన ప్రవీణ్ (24), మధ్యలో  కూర్చున్న మరో యువకుడు కంచరపాలెం ప్రాంతానికి చెందిన ప్రశాంత్ ( 22 )  అక్కడికక్కడే మృతి చెందగా  వెనుక కూర్చున్న కంచరపాలెం ప్రాంతానికి చెందిన  మహేష్ ( 20 ) కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రమాదాన్ని స్థానికులు గమనించి గాయాల పాలైన మహేష్ ను 108 వాహనం ద్వారా  చికిత్స నిమిత్తం కేజీహెచ్  తరలించారు. ఈ సంఘటనలో ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి వాహనం కిలో మీటర్ మేర  దూసుకు పోవడం గమనార్హం. ఘటన స్థలానికి  కంచరపాలెం ట్రాఫిక్ సిఐ దాశరధి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రెండు మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ట్రాఫిక్ సిఐ దాసరధి నేతృత్వంలో కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share