Current Date: 07 Oct, 2024

జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ బదిలీ

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌ సీఎం సాయికాంత్‌ వర్మకు బదిలీ అయ్యింది. ఆయన్ను ఏపీ టౌన్‌ షిప్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్‌కు ఇన్‌చార్జిగా బాధ్యతలప్పగించాలని జీవోలో పేర్కొంది. ఏపీ టౌన్‌షిప్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌ను కూడా బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్‌ ఎక్కడా ఇవ్వలేదు. ఇదిలా ఉంటే భూ హక్కు, భూ రక్షా ప్రత్యేక అధికారి సుబ్బారావును బాపట్ల జిల్లా జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

 

 

Share