Current Date: 07 Oct, 2024

30 కోట్ల సబ్‌స్క్రైబర్లను సాధించిన తొలి యూట్యూబర్ ఇతడే...

యూట్యూబ్ ప్రేక్షకులకు మిస్టర్ బీస్ట్‌గా సుపరిచితమైన జిమ్మీ డొనాల్డ్‌సన్ చరిత్ర సృష్టించాడు.     11 ఏళ్ల క్రితం 300 మంది సబ్‌స్క్రైబర్లను చేరుకున్న   బీస్ట్  ఇప్పుడు ఏకంగా  30 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు కలిగిన తొలి యూట్యూబర్‌గా అత్యంత అరుదైన రికార్డు సృష్టించాడు. ఖరీదైన స్టంట్లు, సవాళ్లలతో వ్యూవర్లను విశేషంగా ఆకట్టుకునే మిస్టర్ బీస్ట్ గత నెలలోనే ప్రముఖ భారతీయ యూట్యూబ్ ఛానల్ టీసిరీస్‌ను అధిగమిస్తూ అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్‌గా రికార్డు సృష్టించాడు. అత్యంత ఆధునిక ప్రొడక్షన్ విలువలతో కూడిన వేగవంతమైన ఎడిటెడ్ వీడియోలకు అతడి ఛానల్ ప్రసిద్ధి.తన దాతృత్వంతో అతడు అశేష అభిమానాన్ని పొందాడు.

Share