Current Date: 06 Jul, 2024

వీడియో బయటికి రావడంతో ఇరకాటంలో పడిన ఎంపీ అభ్యర్థి

ర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ ప్రజ్వల్‌ రేవణ్ణ అకృత్యాలపై పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హసనకు చెందిన జేడీఎస్‌ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. వీటితోపాటు అసభ్యకర ప్రవర్తన, బెదిరించి అభ్యంతరకర వీడియోలు తీయడం వంటి అభియోగాలను అతడిపై మోపారు.

తుపాకీతో బెదిరించి తనపై మూడేళ్లుగా ప్రజ్వల్ అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపించారు. ‘జనవరి 1,2021లో ప్రజ్వల్ రేవణ్ణ తనపై మొదటిసారి తుపాకీతో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని అతడి మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశాడు. ఎంపీ క్వార్టర్‌కు తీసుకెళ్లి తుపాకీ చూపించి బెదిరింపులకు తెగబడ్డాడు... ఈ విషయం ఎవరికైనా చెబితే నన్నూ, నా భర్తను చంపుతానని బెదిరించాడు. తనకు సహకరించకపోతే.. అసభ్యకర వీడియోలను బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు. 2021 జనవరి 1 నుంచి 2024 ఏప్రిల్ 25 మధ్య వీడియోలు చూపించి అనేకసార్లు తనపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డాడు ’ అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీడియోలు బయటకు రావడంతో ప్రజ్వల్‌ రేవణ్ణ దుబాయ్‌ మీదుగా జర్మనీకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.