Current Date: 02 Jul, 2024

28 ఏళ్ల తర్వాత పవన్‌ని కలిసిన హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను కలిసింది. కొత్త ప్రభుత్వానికి సినీ పరిశ్రమ తరఫున నిర్మాతలు అభినందనలు తెలిపారు.ఈ భేటీలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిర్మాతల బృందంలో ఉన్న ఏకైక మహిళ ఈవిడే కావడం గమనార్హం. అంతేకాదు.. 28 ఏళ్ల కిందట విడుదలైన ‘అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి’ సినిమాలో పవన్ కళ్యాణ్‌ సరసన హీరోయిన్‌గా ఆమె నటించారు. ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం.గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించగా.. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా తర్వాత వరుస సినిమాలతో పవన్ కళ్యాణ్ బిజీ కాగా.. సుప్రియ చాలా ఏళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నారు. ఆ మధ్య అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ సినిమాలో కనిపించారు. అక్కినేని నాగార్జునకు మేనకోడలు అయిన సుప్రియ.. చాలా కాలంగా అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చూసుకుంటూ ప్రొడ్యూసర్‌గా సినిమాలు నిర్మిస్తున్నారు.

Share