Current Date: 07 Oct, 2024

ఈ నెల 22న శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఈ నెల 27న తొలి మ్యాచ్

టీ20, వన్డే సిరీస్ లు ఆడేందుకు టీమిండియా ఈ నెల 22న శ్రీలంక పయనం కానుంది. టీ20 సిరీస్ లో సూర్యకుమార్ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వన్డేల్లో ఎప్పట్లాగానే రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. కాగా, శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ 27 నుంచి జరనుగంది. ఆగస్టు 2 నుంచి వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20 మ్యాచ్ లు, 3 వన్డేలు ఆడనుంది. కాగా, టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే బాధ్యతలు అందుకోనున్నాడు. జులై 22న దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.

Share