Current Date: 07 Oct, 2024

అతిథులకి రూ.2 కోట్ల విలువైన వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చిన అంబానీ!

జులై 13న ఆశీర్వాద్ వేడుక, జులై 14న రిసెప్షన్ జరగగా.. భారత్ సహా ఇతర దేశాల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలకి హాజరైన వారిలో అత్యంత సన్నిహితులకి అనంత్ అంబానీ విలువైన బహుమతులు అందించారు.అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ బ్రాండ్‌కు చెందిన రూ. 2 కోట్ల విలువైన వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఖరీదైన వాచీలు అందుకున్నవారిలో బాలీవుడ్ స్టార్లు రణ్‌వీర్ సింగ్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు ఉన్నారు. ఆ వాచీలతో వారు ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఈ వాచీలో 41MM 18 క్యారెట్స్ పింక్ గోల్డ్ కేస్, స్క్రూ లాక్ క్రోన్ వంటివి ఉన్నాయి. ఇంకా గోల్డ్ టోన్డ్ డయల్, బ్లూ కౌంటర్స్, పింక్ గోల్డ్‌తో పొదిగినటువంటి నంబర్స్ ఉన్నాయి. అనంత్ అంబానీ పెళ్లి ఇతర వేడుకల కోసం ముకేశ్ అంబానీ దాదాపు రూ. 5 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

Share