Current Date: 05 Oct, 2024

ఏపీ విజన్ డాక్యుమెంట్ అక్టోబర్ 2న విడుదల

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీ విజన్ డాక్యుమెంట్‌ను  అక్టోబర్ 2న విడుదల చేస్తామని, కలెక్టర్‌లు ఆఫీసులో మాత్రమే కాకుండా ఫీల్డ్ విజిట్ కూడా చేయాలని సూచించారు. క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలన్నారు. గ్రామంలోకి వెళితే పెద్దపెద్ద సభలు వద్దని, తాను కూడా త్వరలో ఆకస్మిక తనికీలు చేస్తానని చెప్పారు. 

Share