Current Date: 07 Oct, 2024

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్త పై టీడీపీ స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ను ప్రైవేట్ పరం కానివ్వమని స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సోషల్ మీడియా లో టీడీపీ తీవ్రంగా స్పందించింది. ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదని టీడీపీ ప్రకటించింది. కేంద్రం తో మాట్లాడి 8 వేల కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. గతంలో వాజపేయి తో మాట్లాడి రెండు వేల కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ ని తెచ్చిన ఘనత చంద్రబాబు దే నంటూ టీడీపీ గుర్తు చేసింది.

Share