Current Date: 04 Jul, 2024

వైసీపీ అభ్యర్థనకు చంద్రబాబు ఓకే మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం

అసెంబ్లీ ప్రారంభం తర్వాత తొలుత కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తొలుత చంద్రబాబు, మంత్రుల తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.  అయితే, వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది.  దీంతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్‌ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

Share