Current Date: 07 Oct, 2024

19న ఢిల్లీకి డిప్యూటీ సీఎం పవన్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 19న (శుక్రవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న జల జీవన్‌ మిషన్‌ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన జల జీవన్‌ మిషన్‌ పథకం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారనే దానిపై దృష్టి సారించింది. అందులో భాగంగా శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈక్రమంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Share