Current Date: 02 Jul, 2024

ఒకేసారి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వ క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి, క్యాబినెట్‌ భేటీ అంశాలను వివరించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఎన్నికల వేళ ఏం చెప్పారో అవన్నీ ఇవాళ క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదించామని చెప్పారు. పేదవాడికి నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తున్నామని మంత్రి పార్థసారధి తెలిపారు. మొదట 183 అన్న క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభిస్తాం, త్వరలో మరో 20 అన్న క్యాంటీన్లను తెరుస్తామని తెలిపారు.

Share