Current Date: 06 Oct, 2024

గురువుకి మస్కా కొట్టి రూ.18 లక్షలతో శిష్యుడు పరార్ కానీ దొరికిపోయాడిలా

లారీ డ్రైవర్‌కి మస్కా కొట్టిన ఓ క్లీనర్ డబ్బుతో పారిపోయాడు. తెలంగాణలోని మధిర నుంచి ఈనెల 17న లారీలో 300 బస్తాల మిర్చిని ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌‌కి లారీ డ్రైవర్‌ షేక్‌ ఖయ్యూం తీసుకెళ్లాడు. అతని వెంట క్లీనర్ పల్లెపోగు కోటేశ్వరరావు కూడా వెళ్లాడు. అక్కడ సరుకు విక్రయించిన అనంతరం లారీ డ్రైవర్‌ షేక్‌ ఖయ్యూం క్లీనర్‌తో కలిసి తిరిగి బయల్దేరాడు.కానీ  మార్గమధ్యంలో డ్రైవర్‌ను బోల్తా కొట్టించిన క్లీనర్ రూ.18.52లక్షలతో పరారయ్యాడు. దాంతో నందిగామ పోలీసులకు లారీ డ్రైవర్‌ ఫిర్యాదు చేశారు.ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద చోరీ సొత్తుతో పరారవుతున్న లారీ క్లీనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.18.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.లారీ డ్రైవర్ కేసు పెట్టగానే.. వాహనాల తనిఖీ చేపట్టారు. నందిగామ ఆటో స్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా ఉన్న క్లీనర్‌ కోటేశ్వరరావును పట్టుకుని నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Share