Current Date: 02 Jul, 2024

ఏపీ పీజీ సెట్‌లో ఏవీఎన్‌ విద్యార్థికి 18వ ర్యాంకు

ఏవీఎన్‌ కళాశాల విద్యార్థులు వివిధ రంగాల్లో విజేతలుగా తిరిగొస్తున్నారు. ఇక్కడ బీఎస్సీ (ఎమ్మెస్సీఎస్‌) చదువుతున్న దాసరి కార్తికేయ అనే విద్యార్థి తాజాగా  ఏపీ పీజీ సెట్‌లో విజేతగా నిలిచాడు. గణాంక శాస్త్రంలో రాష్ట్రంలోనే ఆయన 18వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.సింహాద్రి నాయుడు శుక్రవారం కార్తికేయను అభినందించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ కృష్ణకుమారి, అకడమిక్‌ డీన్‌ జి. శంకర్‌ నారాయణరావు, గణాంక శాస్త్ర విభాగాధిపతి పీ.గాంధీ,  అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, సహచర విద్యార్థులు ఆయన్ను శెభాష్‌ అన్నారు. కార్తికేయ భవిష్యత్తులో మరిన్ని విజయాల్ని సొంతం చేసుకోవాలని వారంతా ఆకాంక్షించారు.

Share