Current Date: 04 Jul, 2024

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన యంగ్ ఓపెనర్.. 17 ఏళ్లలో ఫస్ట్ టైమ్!

రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి  జైశ్వాల్ శతకంతో చెలరేగాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జైశ్వాల్‌కు ఇది రెండో ఐపీఎల్‌ సెంచరీ

సెంచరీతో అదరగొట్టిన జైశ్వాల్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో 23 ఏళ్ల వయస్సు లోపు రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. జైశ్వాల్‌ ప్రస్తుత వయస్సు 22 ఏళ్ల 116 రోజులు. అంతకుముందు జైశ్వాల్‌ గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఇదే ముంబై ఇండియన్స్‌పై 21 ఏళ్ల 123 రోజుల వయస్సులో సెంచరీ సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇంత పిన్న వయస్సులో ఈ ఘనత సాధించడం ఎవరికీ సాధ్యం కాలేదు.

ఐపీఎల్‌ 2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ జోరు కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జైపూర్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ 18.4 ఓవర్లలో  కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి చేధించింది.