Current Date: 07 Oct, 2024

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ!

ఏపీలోఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్‌ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్కీమ్‌ అమలుకు ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో మహిళలకు స్మార్ట్‌ కార్డులు జారీ చేయగా తెలంగాణలో మాత్రం జీరో టికెట్ల విధానం అనుసరిస్తున్నారు.

Share