Current Date: 07 Oct, 2024

టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ

విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు  క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. టీ20 ప్రపంచకప్  గెలుచుకుని వచ్చిన రోహిత్ సేనకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.125 కోట్ల నజరానా అందించినట్టు తెలిపింది. రోహిత్ సేన భారత్‌కు రాగానే ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రూ.125 కోట్ల ప్రైజ్‌మనీకి సంబంధించిన చెక్కును అందించారు.
 

Share