Current Date: 02 Jul, 2024

అమరావతి కోసం రామోజీ గ్రూప్ రూ.10 కోట్లు విరాళం!

ఏపీ రాజధాని అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా అవతరించాలని ఈనాడు సంస్థల ఎండీ సీహెచ్‌ కిరణ్‌ అభిలాషిస్తూ.. అమరావతి నిర్మాణానికి రామోజీ గ్రూప్ నుంచి రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్టుగా ప్రకటించారు.ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా రామోజీరావు బాధితుల పక్షం వహించేవారని తెలిపారు. దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా.. ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారన్నారు. ఆయన నమ్మిన పాటించిన విలువలను త్రికరణశుద్ధిగా కొనసాగిస్తామని తమ కుటుంబం తరపున సభా ముఖంగా మాటిస్తున్నానని చెప్పుకొచ్చారు.విజయవాడలోని కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు.

Share