Current Date: 05 Oct, 2024

కోహ్లీతో గొడవ.. ఫస్ట్ టైమ్ స్పందించిన కోచ్ గంభీర్

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో గొడవలపై టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారి స్పందించాడు. శ్రీలంక టూర్‌కి భారత్ జట్టు వెళ్లే ముందు హెడ్ కోచ్ హోదాలో గౌతమ్ గంభీర్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. ఐపీఎల్ ఆడే సమయంలో దాదాపు 3-4 సార్లు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మైదానంలోనే గొడవపడిన విషయం తెలిసిందే. మీడియా సంస్థలు తమ టీఆర్పీలు పెంచుకోవడం కోసం విరాట్ కోహ్లీతో నాకు గొడవలు ఉన్నాయి. ఇద్దరి మధ్య సంబంధం ఉండదు అని స్టోరీలు చేస్తున్నారు. కానీ..మేమిద్దరం భారత్ కోసం ఆడేందుకు సిద్ధమవుతున్నాం. 140 కోట్ల మందికి భార‌తీయుల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాం. దేశాన్ని గ‌ర్వంగా నిలిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. అఫ్‌ఫీల్డ్‌లోనూ కోహ్లీతో నాకు చక్కటి అనుబంధం ఉంది. ఇదంతా పబ్లిక్ కోసం కాదు. నేను విరాట్‌తో ఎన్నిసార్లు మాట్లాడనే విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ప్రపంచ స్థాయి క్రికెటర్ వరల్డ్ క్లాస్ అథ్లెట్. మేమిద్దరం భారత్‌ కోసం ఇలాగే కొనసాగుతాం అని గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు.

Share