Current Date: 07 Oct, 2024

ఇదే తేడా

 జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అక్కడ నాయకులన్ని, మంత్రుల్ని తనొక్కడే కలిసేవారు. వారితో జగన్‌ ఏం మాట్లాడే వారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీవెళ్లిన చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ కలిసినప్పటి చిత్రం చూడండి..టీడీపీ ఎంపీలు మొత్తం మూటగట్టుకొని నిర్మల సీతారామన్‌ దగ్గరి కెళ్ళి కూర్చున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడేటప్పుడు అందులో దాపరికం ఎందుకు? టీడీపీ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఈ పద్ధతినే ఢిల్లీ అనుసరిస్తున్నారు. గతంలో జగన్‌ మాత్రమే మంత్రిల్ని కలిసి ఫోటోలు విడుదల చేసేవారు. వైసీపీకి ఢల్లీలో చక్రం తిప్పే విజయసాయి రెడ్డి లాంటి వారు కూడా జగన్‌ మాట్లాడుతున్నంత సేపు బయట వెయిట్‌ చేయాల్సిందే..అయితే ఇప్పుడు ఆ బాధ తప్పిందని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.

Share