Current Date: 06 Oct, 2024

మల్లికార్జున మరోమాయ

జగనన్న ఇళ్ళ నిర్మాణంలో జిల్లా కలెక్టర్‌ ఏ.మల్లికార్జున భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడిచారు. ఇంటి కోసం తలతాకట్టుపెట్టి లబ్దిదారులు అప్పుచేసి కట్టిన సొమ్ముకు అతీగతీ లేకుండా పోయింది. డబ్బు కట్టిన లబ్దిదారులకు పాడుబడిన పునాదులు వెక్కిరిస్తున్నాయి. ఇందుకు ముదపాకలో నిర్మించ తలపెట్టిన జగనన్న ఇళ్ళ కాలనీలే నిదర్మనం. ఒక పక్క జగనన్న ఇళ్ళ కోసం దళితుల భూముల సేకరణలో దగాకు పాల్పడ్డ మల్లికార్జున ఇళ్ళు నిర్మాణం విషయంలో కూడా అవినీతికి ఆశ్రయమిచ్చారు. దీంతో ఇళ్ళ నిర్మాణాలు పునాదుల దగ్గరే ఆగిపోయాయి. ఇంటికి 35వేల రూపాయల చొప్పున చేతి సొమ్ము చెల్లించిన లబ్దిదారులు నిలువునా మునిగిపోయారు. 

Share