Current Date: 06 Oct, 2024

అరుంధతి రాయ్, షౌకత్ హుస్సేన్లపై ఫాసిస్ట్ ఉపా కేసును రద్దు చేయాలి

ఉద్యమకారిణి అరుంధతి రాయ్, ప్రొఫెసర్ షౌకత్ హుస్సేన్ లపై బనాయించిన ఫాసిస్ట్ ఉపా కేసును వెంటనే రద్దు చేయాలని పౌర ప్రజాసంఘాల వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక నాయకులు మాట్లాడుతూ 14 ఏళ్ళ క్రితం నాటి ఏ వాస్తవికతచట్టబద్ధత లేని ఆరోపణలను ఆధారంగా చేసుకుని, కేంద్ర ప్రభుత్వం నుండి సంబంధిత పద్ధతుల్లో ఏ రకమైన ఆమోదం తీసుకోకుండానే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె సక్సేనా, వారిపై ఉపా కేసును కేసును బనాయించడానికి ఢిల్లీ పోలీసులకు అనుమతినివ్వడం అప్రజాస్వామిక చట్ట విరుద్ధం రాజ్యాంగ వ్యతిరేక కక్ష సాధింపు చర్య అన్నారు. 

Share