Current Date: 24 Sep, 2024

భార్యతో విడాకుల తర్వాత తొలిసారి కొడుకుని కలిసిన క్రికెటర్ హార్దిక్ పాండ్య

భార‌త ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా చాలా రోజుల తర్వాత తన కొడుకు అగస్త్యని కలిశాడు. నటాషాతో విడాకుల తర్వాత తొలిసారి తన కొడుకు అగ‌స్త్య‌ను కలిసిన పాండ్యా ఆనందానికి  హ‌ద్దే లేకుండా పోయింది. మురిపెంగా అగ‌స్త్య‌ను ఎత్తుకున్న పాండ్యా ముఖం తారాజువ్వాలా వెలిగిపోయింది.  భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్  2020లో మొదటిసారి వివాహం చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు.  తరువాత పిల్లాడి సమక్షంలో మరోసారి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు హార్దిక్- నటాషా. నాలుగేళ్ళు అంతా బాగానే ఉంది. అయితే చాలా కాలంగా వీరిద్దరి మధ్య సయోధ్య లేదంటూ వార్తలు వచ్చాయి. జూలై 19న వారు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.భార్యా భర్తలుగా విడిపోయినా  కో-పేరెంట్స్‌గా అగస్త్యకి తాము చేయాల్సిందంతా చేస్తామని ఇద్దరూ వెల్లడించారు. దీని తరువాత, అగస్త్య ను నటాషా త‌న స్వ‌దేశం అయిన సెర్బియాకు తీసుకు వెళ్లింది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకున్న చాలా కాలం తర్వాత డు అగస్త్యను కలిశాడు. కొద్ది రోజుల క్రితం నటాషా ముంబైలో తన రూమర్డ్  బాయ్‌ఫ్రెండ్‌ అలెగ్జాండర్ ఇలాక్ తో షికారు చేస్తున్న ఫొటోలు వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

Share