Current Date: 24 Sep, 2024

చెట్టుకి చీరకట్టి క్షుద్ర పూజలు తెలంగాణలో కలకలం

తెలంగాణలో ఇప్పుడు క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఓ చోట చెట్టుకు చీర కట్టి.. రోడ్డుపై ముగ్గేసి.. చుట్టూ రక్తం చల్లినట్లు ఆనవాళ్లు కనిపించగా.. మరో చోట ఊరిలో చీడ గాలి పోవాలని సామూహికంగా మేకలను బలిచ్చారు. దీంతో ఆ ఊరంతా ఎటు చేసిన రక్తపాతమే కనిపిస్తోంది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామ సమీపంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు భయాందోళన కలిగించాయి. గ్రామంలోకి వెళ్లే దారిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూల మలుపు వద్ద ఉన్న ఓ చెట్టుకి చీర కట్టి, ఎదురుగా ముగ్గు వేసి.. దాని చుట్టూ రక్తపు మరకలను వేశారు. ఘటనా స్థలంలోనే కుంకుమ, పసుపు, నిమ్మకాయలను పేర్చి కోడిని కోసి వదిలిపెట్టిన ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు.గ్రామంలోకి రావాలన్నా అదే దారిలో రావాలని.. చిన్నారులు కూడా అలానే వస్తారని.. వారికి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అంటూ ఆందోళన చెందుతున్నారు. క్షుద్రపూజలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇదే ప్రదేశంలో ఇలాంటి పూజలు చేస్తున్నారని.. వీటిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Share