Current Date: 30 Sep, 2024

హీరో రామ్‌చరణ్‌కి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు

ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులకు ఈ గౌరవం దక్కింది. అయితే, తాజాగా విగ్రహం కూడా ఆవిష్కరించనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా వారు పెట్టనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి అయిదని తాజాగా జరిగిన ఐఫా వేదక మీద టుస్సాడ్స్‌ టీమ్‌ ప్రకటించింది. ఇప్పటికే స్టార్‌ హీరోలు ప్రభాస్‌‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌ కొలువుదీరిన విషయం తెలిసిందే. అయితే, మేడమ్ టుస్సాడ్స్ పుట్టిల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగు పెడుతున్న మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రభాస్‌  (బ్యాంకాక్‌ మ్యూజియం), మహేశ్‌ బాబు (సింగపూర్‌), అల్లు అర్జున్‌ (దుబాయ్‌)లలో వారి మైనపు విగ్రహాలు ఉన్నాయి.

Share