Current Date: 04 Jul, 2024

ఆ బంధం మాటల్లో చెప్పలేనిది.. మోదీ ఎమోషనల్‌ పోస్ట్‌...

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగం మరో కీలక ఘట్టానికి తెర లేవనుంది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్‌ వేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని బీజేపీ సన్నాహాలు చేస్తోంది.ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో పాటు, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఎన్డీఏ కూటమిలోని పార్టీల అధినేతలకు ఆహ్వానం అందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.ఇక మరికొన్ని గంటల్లో నామినేషన్‌ దాఖలు చేయనున్న క్రమంలో ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. వారణాసితో తనకు ఉన్న అనుబంధం గురించి వివరిస్తూ వీడియోను దేశ ప్రజలతో పంచుకున్నారు.